ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేసిన బీజేపీ

ABN, First Publish Date - 2021-10-19T15:14:10+05:30

దళిత బంధు పథకం అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ లేఖ వలనే దళితబంధు పథకం నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈనెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. దళితబంధు లబ్ధిదారులను గుర్తించినప్పటికీ వాళ్ళ ఖాతాలో కావాలనే నగదు జమ చేయటంలేదని ఆరోపించారు. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు దళితబంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని అధికార పార్టీ  ప్రయత్నాలు చేస్తోందన్నారు. దళితబంధు విషయంలో అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసినా నిధులను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ హోల్డ్ చేశారని ఆ లేఖలో పేర్కొన్నట్లు ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-19T15:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising