ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘నిజాంలాగా నువ్వు, నీ కొడుకు, నీ మనవడి రాజ్యం కాదు కేసీఆర్’’

ABN, First Publish Date - 2021-10-22T19:34:22+05:30

టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడేవన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. పదవులు ఇచ్చారని, అవమానించి బయటికి పంపించారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడేవన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. పదవులు ఇచ్చారని, అవమానించి బయటికి పంపించారని విమర్శించారు. కేసీఆర్ అబ్బ జాగీరు కాదని.. పెన్షన్, రేషన్ కార్డులు పోవడానికి. అది మన సొమ్ము అని అన్నారు. ప్రజల హక్కు హరించడానికి కేసీఆర్‌ ఎవరు అని ప్రశ్నించారు.  రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నావు కదా కేసీఆర్... 65 రోజులుగా ఎందుకు దళిత బంధు ఇవ్వలేదని నిలదీశారు. అర చేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నరని మండిపడ్డారు. ‘‘నన్ను సాదుకుంటారా?..చంపుకుంటారా?... నా ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌తో కొట్లాడతా’’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ‘‘ఎమ్మెల్సీల్లార మీకు సిగ్గు ఉందా? ఇందుకా మీ ప్రజలు ఓట్లు వేసింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిజాంలాగా నువ్వు, నీ కొడుకు, నీ మనవడి రాజ్యం కాదు కేసీఆర్’’ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-10-22T19:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising