ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

ABN, First Publish Date - 2021-07-30T06:37:37+05:30

పోలీస్‌ స్టేష న్‌కు వచ్చే పిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించా లని ఎస్పీ రాహూల్‌హెగ్డే సూచించారు.

సిరిసిల్ల రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ రాహూల్‌హెగ్డే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ రాహూల్‌హెగ్డే 

సిరిసిల్ల క్రైం/తంగళ్లపల్లి జూలై 29: పోలీస్‌ స్టేష న్‌కు వచ్చే పిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించా లని  ఎస్పీ రాహూల్‌హెగ్డే సూచించారు. సిరిసిల్ల ప ట్టణంలోని రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం, తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌లను ఎస్పీ రాహూల్‌హెగ్డే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కార్యాలయంలోని రికార్డులు, పెండింగ్‌ కేసులు, సి బ్బంది వివరాలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర నియం త్రణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. క్రిమినల్‌ గ్యాం గ్‌లపై నిఘా పెట్టాలని, ఫిర్యాదుదారులతో మర్యాద గా మెలగాలన్నారు. 

పోలీస్‌ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని క మ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమెరాల ఏ ర్పాటులో ప్రజలు భాగస్వామ్యం చేయాలని సూచిం చారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రశేఖర్‌, రూరల్‌ సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐలు లక్ష్మారెడ్డి, రఫీక్‌ఖాన్‌, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-07-30T06:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising