ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు: బండి సంజయ్
ABN, First Publish Date - 2021-11-01T20:33:05+05:30
హుజురాబాద్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోకుండా టీఆర్ఎస్ నేతలు...
హైదరాబాద్: హుజురాబాద్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని టీఆర్ఎస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో శ్రమించిన బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ అభినందించారు.
Updated Date - 2021-11-01T20:33:05+05:30 IST