ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్టి వ్యవసాయానికి యువరైతుల శ్రీకారం

ABN, First Publish Date - 2021-06-24T07:04:55+05:30

జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలోని పలువురు యువరైతులు సమష్టి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు.

గజసింగవరంలో భూమిని పరిశీలిస్తున్న యువరైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కేసీఆర్‌ పిలుపుతో ముందడగు

- ఆదర్శంగా నిలవనున్న గజసింగవరం  


గంభీరావుపేట, జూన్‌ 23 :జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలోని పలువురు యువరైతులు సమష్టి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. కుల మతాలకు అతీతంగా ‘అందరం ఒక్కటే’ అనే నినాదంతో గ్రామంలోని అన్ని కులాలకు చెందిన యువరైతులు నడుం బిగించారు. ‘కులం లేదు. మతం లేదు. ఊరంత ఒక్కటే. ఒక్కటే కులం. ఏ కులం అంటే అభివృద్ధి కులం.. బాగుపడే కులం.. బాగుచేసే కులం. బతుకులు మార్చే కులం అంద రినీ బ్రహ్మాండంగా తీర్చిదిద్దే కులం’ అని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న మాటలను ఆదర్శంగా తీసుకున్నారు. ‘అందరం కలిసి ఒకే చోట వ్యవసాయం చేద్దాం. గ్రామ అభివృద్ధికి తోడ్పడుదాం’  అనే నినాదంతో ముందడుగు వేశారు. గ్రామంలోని అన్ని కులాలకు చెందిన యువరైతులు బుధవారం వ్యవసాయ భూములను పరిశీలించారు. చదును  చేయాలని నిర్ణయిం చారు. దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్థీర్ణంలో వరి పం టను సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందిం చుకున్నారు. వీరిలో ముదిరాజ్‌, యాదవ, ఎస్సీ, రెడ్డి, విశ్వబ్రాహ్మణ, గంగపుత్రులు, ముస్లిం లతోపాటు ఇతర కులాలకు చెందిన యువ రైతులు ఉన్నారు.  

Updated Date - 2021-06-24T07:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising