కామారెడ్డి జిల్లా: రైతుల రాస్తారోకో...
ABN, First Publish Date - 2021-12-07T18:02:04+05:30
మాచరెడ్డి మండలం, పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
కామారెడ్డి జిల్లా: వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాచరెడ్డి మండలం, పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని, రోడ్డుపై కూర్చున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు రోడ్డుకు ఇరు వైపులా నిలిచిపోయాయి. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
Updated Date - 2021-12-07T18:02:04+05:30 IST