ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలి
ABN, First Publish Date - 2021-08-04T08:44:03+05:30
ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎ్సయూ) ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులు మారేడుపల్లిలోని..
పీడీఎ్సయూ ఆధ్వర్యంలో తలసాని ఇంటి ముట్టడి యత్నం
మారేడుపల్లి ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎ్సయూ) ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులు మారేడుపల్లిలోని మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ రెండు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్లను ముట్టడించే ప్రయత్నం చేశాయి. ఉదయం 11 గంటలకు వారు ప్లకార్డులతో తలసాని నివాసం సమీపానికి చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని 11 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్, పీడీఎ్సయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Updated Date - 2021-08-04T08:44:03+05:30 IST