జీడికల్ ఆలయానికి రూ. 92వేల ఆదాయం
ABN, First Publish Date - 2021-10-22T05:10:24+05:30
జీడికల్ ఆలయానికి రూ. 92వేల ఆదాయం
లింగాలఘణపురం అక్టోబరు 21: మండలంలోని సుప్రసిద్ధ జీడికల్ వీరాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా రూ.92,607లు ఆదాయ సమకూరినట్లు ఈవో శేషుభారతి, సీనియర్ అసి స్టెంట్ కెకె రాములు గురువారం తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో సంబంధిత శాఖ ఉద్యోగులు కుర్రెముల మోహన్, భరత్కుమార్, మల్లేశం, ఆలయ చైర్మన్ సానికె మధుతో పాటుగా ధర్మకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:10:24+05:30 IST