హుజురాబాద్ ఎన్నికల ఖర్చుపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2021-11-09T20:56:16+05:30
హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చుపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చుపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయన్నారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉభయ పార్టీలు పెట్టిన ఖర్చు కంటే... హుజురాబాద్లో పెట్టిన డబ్బులు ఎక్కువని విమర్శించారు. దళితబంధు తరహాలో ఎక్కడా ఇంత డబ్బు వృథా అవ్వలేదన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో పెట్టాల్సిన డబ్బును.. ఇలా ఇవ్వడం అనైతికమన్నారు. ప్రజలకు మెరుగైన అవకాశాలు ఇవ్వాల్సింది పోయి.. నేరుగా రూ. లక్షలు ఇవ్వడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-11-09T20:56:16+05:30 IST