మల్లన్నను తిడితే ఊరుకునేది లేదు: జవహర్నగర్ మేయర్
ABN, First Publish Date - 2021-08-26T17:10:00+05:30
మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జవహర్ నగర్ మేయర్ మండిపడ్డారు.
హైదరాబాద్: నిన్న మంత్రి మల్లారెడ్డి కబ్జాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మంత్రి మల్లన్నను తిడితే ఊరుకునేది లేదని అన్నారు. జవహర్ నగర్లో ఆస్పత్రి తాము అడిగితేనే మల్లారెడ్డి నిర్మించారని, పేద ప్రజలను కాపాడుతున్నారని అన్నారు. జవహర్ నగర్కు రేవంత్ ఎప్పుడైనా వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. ఇక్కడ రేవంత్ అంటే ఎవరికీ తెలియదని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలను తిడితే మాత్రం సహించేదిలేదని మేకల కావ్య మరోసారి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
Updated Date - 2021-08-26T17:10:00+05:30 IST