జవహర్ నగర్: పిల్లలపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్
ABN, First Publish Date - 2021-07-11T01:04:50+05:30
జవహర్ నగర్లో పిల్లలపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్
హైదరాబాద్: జవహర్ నగర్లో పిల్లలపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో ఇద్దరు చిన్నారులపై నిందితుడు అభిరామ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒడిశాకు చెందిన అభిరామ్ కొంతకాలంగా జవహర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. సైకోగా మారి పిల్లల పై అత్యాచారాలకు అభిరామ్ పాల్పడుతున్నాడు. ఈనెల 4న మూడున్నరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి అభిరామ్ పాల్పడ్డాడు. నిన్న మరొక బాలికను కిడ్నాప్ చేసేందుకు అభిరామ్ యత్నించాడు. ఎట్టకేలకు అభిరామ్ను పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Updated Date - 2021-07-11T01:04:50+05:30 IST