ఆటోను ఢీకొన్న ట్రాక్టర్...మహిళ మృతి
ABN, First Publish Date - 2021-10-18T18:23:38+05:30
జిల్లాలోని జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను ఢీకొన్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
జనగామ: జిల్లాలోని జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను ఢీకొన్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కల్పన(35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.... ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10 మందితో స్టేషన్ ఘనపూర్ నుండి వ్యవసాయ పనులకు ఉప్పుగల్లుకు వెళుతుండగా ఘటన జరిగింది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు.
Updated Date - 2021-10-18T18:23:38+05:30 IST