ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంటనే చేయాలి: పవన్
ABN, First Publish Date - 2021-09-15T23:20:49+05:30
నగరంలో సంచలనం సృష్టించిన బాలిక అత్యాచారం, హత్య ఘటనలో
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన బాలిక అత్యాచారం, హత్య ఘటనలో సైదాబాద్ చిన్నారి కుటుంబసభ్యులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. చిన్నారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతని పవన్ కల్యాణ్ తెలిపారు. కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేసినప్పుడే పోలీసులు స్పందించాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని పవన్కల్యాణ్ విమర్శించారు.
పార్టీలకతీతంగా అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి సహాయం, ఓదార్పు అందించాలన్నారు. ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంటనే ఆలోచించి చేయాల పవన్ అన్నారు. దోషికి కఠిన శిక్ష పడే వరకూ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు.
Updated Date - 2021-09-15T23:20:49+05:30 IST