టీఆర్ఎస్ వచ్చాక ఎన్నికలు కలుషితమయ్యాయి: జానారెడ్డి
ABN, First Publish Date - 2021-04-13T21:59:51+05:30
టీఆర్ఎస్ వచ్చాక ఎన్నికలు కలుషితమయ్యాయని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై
నల్గొండ: టీఆర్ఎస్ వచ్చాక ఎన్నికలు కలుషితమయ్యాయని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సాగర్లో ఏం చేశారని టీఆర్ఎస్కు ఓటేయాలని జానారెడ్డి ప్రశ్నించారు. ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం కేసీఆర్ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని జానారెడ్డి తెలిపారు. కేసీఆర్ తనను అడిగి ఉంటే నోముల కుటుంబం కోసం పోటీ నుంచి తప్పుకునేవాడిని జానారెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ వచ్చాక ఎన్నికలు కలుషితమయ్యాయని జానారెడ్డి అన్నారు. డబ్బు, మద్యం, తప్పుడు హామీలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని జానారెడ్డి విమర్శించారు.
Updated Date - 2021-04-13T21:59:51+05:30 IST