జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
ABN, First Publish Date - 2021-09-30T02:27:39+05:30
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ కేసులో విచారణ పూర్తైందని ధర్మాసనానికి ఈడీ తెలిపింది. అభియోగాల నమోదుపై వాదనలకు చివరి అవకాశమని జగన్, విజయసాయిరెడ్డిని కోర్టు ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసు విచారణ అక్టోబరు 5కి వాయిదా వేసింది.
మరోవైపు ఇదే కోర్టులో ఎమ్మార్ కేసు విచారణ కూడా జరిగింది. దర్యాప్తు స్థాయి తెలిపేందుకు ఈడీ రెండు వారాల గడువు కోరింది. కోనేరు మధు ఎల్వోఆర్పై వివరాలు తెలిపేందుకు సీబీఐ గడువు కోరింది. దీంతో ఈ కేసు విచారణ అక్టోబరు 12కి, సీబీఐ కేసు అక్టోబరు 4కి వాయిదావేసింది.
Updated Date - 2021-09-30T02:27:39+05:30 IST