టెర్రరిస్టుల కన్నా ఆర్ఎస్ఎస్ ప్రమాదకరం: గజ్జల కాంతం
ABN, First Publish Date - 2021-01-25T17:37:53+05:30
తీవ్రవాదులు, ఉగ్రవాదుల కన్నా ఆర్ఎస్ఎస్ చాలా ప్రమాదకరమని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కరీంనగర్లో...
కరీంనగర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టుల కన్నా ఆర్ఎస్ఎస్ చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించాలన్నారు. రామమందిర నిర్మాణ కోసం సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసిందని, చిత్తశుద్ధి ఉంటే రామమందిర నిర్మాణానికి వెయ్యికోట్లు ఇవ్వాలని గజ్జల కాంతం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-01-25T17:37:53+05:30 IST