ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయంతో.. మృతదేహాలను పాతిపెట్టేశారు..

ABN, First Publish Date - 2021-09-17T01:05:19+05:30

కుమురంభీం జిల్లా: అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చనిపోయారు. అయితే వణ్యప్రాణుల వేటగాళ్లు.. భయంతో ఆ మృతదేహాలను పాతిపెట్టారు. ఈ ఘటన కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం విలేజ్ నెం ఆరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుమురంభీం జిల్లా: అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చనిపోయారు. అయితే వణ్యప్రాణుల వేటగాళ్లు.. భయంతో ఆ మృతదేహాలను పాతిపెట్టారు. ఈ ఘటన కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం విలేజ్ నెం ఆరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామ సమీపంలో పొలం వద్ద వేటగాళ్లు.. వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. ఇద్దరు యువకులు వేట కోసం అటుగా వెళ్తూ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.


బయటికి తెలిస్తే ఏమవుతుందోననే భయంతో ఆ మృతదేహాలను వేటగాళ్లు పాతిపెట్టారు. మృతులు గన్నారం గ్రామానికి చెందిన సత్తయ్య, దుర్గారాజ్‌గా గుర్తించారు. బుధవారం రాత్రి వన్యప్రాణుల వేటకు వెళ్లిన యువకులు.. వేరే వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగల కారణంగా మృతి చెందారు. ఈస్గాం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-17T01:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising