ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్‎లో టెన్షన్.. టెన్షన్.. ఈటల వర్సెస్ పల్లా

ABN, First Publish Date - 2021-06-17T17:50:39+05:30

హూజురాబాద్‎లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌గా పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాల్లోకెళితే.. పల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ : హూజురాబాద్‎లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌గా పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాల్లోకెళితే.. పల్లా గురువారం నాడు పర్యటించారు. అయితే.. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా హూజురాబాద్‎లో పర్యటించారు. ఈ క్రమంలో హుజురాబాద్‎లోని కాట్రపల్లి వద్ద ఈటల-పల్లా రాజేశ్వర్ వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. దీంతో కాట్రాపల్లి వద్ద పల్లాను చూసిన ఈటల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు ‘జై ఈటల.. జైజై ఈటల.. జై బీజేపీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. 


మరోవైపు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి వాహనంలో ఉన్న కార్యకర్తలు కూడా ‘జై టీఆర్ఎస్.. జై పల్లా రాజేశ్వర్ రెడ్డి’ అంటూ పోటా పోటీగా నినాదాలు చేశారు. ఇలా ఇరుపార్టీల నినాదాలతో కాట్రపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరువర్గీయులను పంపేసి ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు.

Updated Date - 2021-06-17T17:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising