ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కావాలని పాదయాత్ర చేయడం లేదు: సంజయ్

ABN, First Publish Date - 2021-10-02T23:46:40+05:30

సీఎం కావాలని పాదయాత్ర చేయడం లేదని, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నానని బీజేపీ నేత బండి సంజయ్ ప్రకటించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్: సీఎం కావాలని పాదయాత్ర చేయడం లేదని, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నానని బీజేపీ నేత బండి సంజయ్ ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వైద్యం, విద్య విషయంపైనే మొదటి సంతకం పెడుతామని ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లను టీఆర్ఎస్‌ నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సౌకర్యాలు, తగిన సిబ్బంది లేరని తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని, టీఆర్ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా.. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపును అడ్డుకోలేరని సంజయ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-02T23:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising