ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-09-16T01:09:40+05:30

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడో దశ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడో దశ కరోనాను ఎదుర్కొనే ప్రణాళికను ప్రభుత్వం సమర్పించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బడులు ప్రారంభమైనందున పిల్లల్లో కరోనా సోకకుండా మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చేతులెత్తయకుండా ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హైకోర్టు సూచించింది. జిల్లాల్లోనూ పిల్లల ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలని హైకోర్టు ఆదేశించింది.


 జులై 15న నిపుణుల కమిటీ సమావేశమై పలు సిఫార్సులను చేసిందని ఏజీ తెలిపారు. నిపుణుల కమిటీల సిఫార్సుల అమలుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 22 వరకు మూడో దశ కరోనా ప్రణాళికను ప్రభుత్వం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనాను ఎదుర్కొనే సన్నద్ధతపై ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం స్పందించక పోతే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-09-16T01:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising