ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధురాలి మృతదేహాన్ని తెచ్చి.. శ్మశానంలో అనాథగా వదిలేసి..

ABN, First Publish Date - 2021-04-21T09:50:21+05:30

అర్ధరాత్రి వృద్ధురాలి మృతదేహాన్ని కొందరు శ్మశాన వాటికకు తెచ్చారు. ఓ గద్దె మీద ఉంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌లో సంబంధీకుల అమానవీయం 

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 20 (నిజామాబాద్‌): అర్ధరాత్రి వృద్ధురాలి మృతదేహాన్ని కొందరు శ్మశాన వాటికకు తెచ్చారు. ఓ గద్దె మీద ఉంచి.. కట్టెలు తెస్తామని అక్కడి వాచ్‌మన్‌కు చెప్పి వెళ్లిపోయారు. వెళ్లినవారు మళ్లీ రాలేదు. గంటలు గడిచాయి.. తెల్లవారిపోయినా వారు రాలేదు. ఆ మృతదేహం ఎవరిదో.. వదిలేసిన వారెవరో తెలియదు గానీ.. అనుబంధాలను, మానవసంబంధాలను ప్రశ్నించేలా ఉన్న ఈ ఘటన నిజామాబాద్‌లో స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని ప్రగతినగర్‌ శ్మశానవాటిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్మశానవాటిక వాచ్‌మన్‌ మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు, స్థానికులు చొరవచూపి వృద్ధురాలి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతురాలు ఎవరు? మృతదేహాన్ని వదిలేసి వెళ్లినవారెవరు? అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2021-04-21T09:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising