ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 23 నుంచి రెండు రోజుల పాటు ఐజేయూ జాతీయ సమావేశాలు

ABN, First Publish Date - 2021-10-21T23:12:31+05:30

ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఐజేయూ) నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశాలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఐజేయూ) నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశాలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు నగరంలోని బేగం పేటలో ఉన్న టూరిజం ప్లాజాలో జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఈ సమావేశాలు జరుగునున్నాయని తెలిపారు. సమావేశాల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలల్లో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులు హాజరు కానున్నారు.


రెండు రోజల పాటు జరిగే ఈ సమావేశాల్లో దేశంలో జర్నలిస్టులు వృత్తిలో ఎదుర్కొంటున్నసమస్యలు, ఫ్రీడమ్‌ ఆఫ్‌ ప్రెస్‌, జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు, జర్నలిస్టుల రక్షణకు మీడియా సంస్థలు తీసుకోవాల్సిన రక్షణచర్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాలకు టూరిజం, ఎక్జైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రణాళికా సంఘం ఉపాఽధ్యక్షుడు వినోద్‌కుమార్‌ హాజరు కానున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (టీయూడబ్ల్యూజె) హోస్ట్‌ చేస్తోంది. 

Updated Date - 2021-10-21T23:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising