ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ బొమ్మకు ఓటేసే రోజులు పోయాయ్‌

ABN, First Publish Date - 2021-10-19T07:26:56+05:30

కేసీఆర్‌ బొమ్మతో హుజూరాబాద్‌లో గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వాళ్లు అనుకుంటున్నారని, ఆయన బొమ్మకు ఓటు పడే రోజులు పోయాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాది కారు గుర్తు అని దుష్ప్రచారం: ఈటల

వీణవంక, అక్టోబరు 18: కేసీఆర్‌ బొమ్మతో హుజూరాబాద్‌లో గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వాళ్లు అనుకుంటున్నారని, ఆయన బొమ్మకు ఓటు పడే రోజులు పోయాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గ్రామాల్లో కేసీఆర్‌కు ముఖం చెల్లక, రాజేందరన్న పేరు చెబితేనే ఓట్లు పడతాయని.. ఈటలది కారు గుర్తు అని చెబుతున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని గంగారం, ఎలబాక, మామిడాలపల్లి, చల్లూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడేళ్లుగా డీడీలు కట్టినా గొల్ల, కురుమలకు గొర్లు ఇవ్వలేదని, తన రాజీనామా తర్వాతనే హుజూరాబాద్‌ ప్రజలకు గొర్లు ఇచ్చారని చెప్పారు. అది వారిపైన ప్రేమకాదని, ఓట్ల మీద ప్రేమ అని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు టికెట్‌ ఇప్పించానని, ఆయన గెలవడానికి ప్రచారం చేశానని, ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి తనను ఓడగొట్టేందుకు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాజేందరన్నకు కేసీఆర్‌ అన్యాయం చేశారని హుజూరాబాద్‌ ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు.

Updated Date - 2021-10-19T07:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising