‘ఆంధ్రజ్యోతి’ కథనంపై వైఎస్ షర్మిల స్పందన
ABN, First Publish Date - 2021-05-18T18:23:12+05:30
తాత్కాలిక నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడం పట్ల ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై వైఎస్ షర్మిల స్పందించారు.
హైదరాబాద్: తాత్కాలిక నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడం పట్ల ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై వైఎస్ షర్మిల స్పందించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ను షర్మిల ప్రశ్నించారు. ‘‘అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే .. ఇక సీఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే .." అని ముచ్చట చెప్పిన కేసీఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయి, కరోనా విజృంభిస్తున్న వేళా .. కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించుకొన్నది ప్రభుత్వం. 2017 లో 3311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, అర్హత సాధించిన ఇంకా 658 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిపై నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకొనే ప్రభుత్వం, ముందు అర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్గా రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
Updated Date - 2021-05-18T18:23:12+05:30 IST