జీడిమెట్ల పారిశ్రామికవాడలో.. రోడ్డు పక్కనే వ్యర్థరసాయన జలాలు
ABN, First Publish Date - 2021-01-18T06:16:40+05:30
జీడిమెట్ల పారిశ్రామికవాడలో ప్రమాదకరమైన రసాయన వ్యర్థ జలాలు ప్రధాన రహదారి పక్కనే ప్రవహిస్తున్నాయి.
జీడిమెట్ల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పారిశ్రామికవాడలో ప్రమాదకరమైన రసాయన వ్యర్థ జలాలు ప్రధాన రహదారి పక్కనే ప్రవహిస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు వ్యర్థ రసాయన జలాలను రోడ్డుపైనే పారబోస్తున్నాయి. ఫలితంగా నర్సాపూర్ ప్రధాన రహదారిపై వెళ్లే వారు విషవాయువుల ఘాటును భరించలేకపోతున్నారు. హెటిరోడ్రగ్స్, ఆరోరాఫార్మాకు మధ్యలో ఉన్న రోడ్డు పక్కన వ్యర్థ రసాయన జలాలు ప్రవహిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు నిత్య ఈ రోడ్డుపైనే ప్రయాణిస్తున్నా చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-01-18T06:16:40+05:30 IST