వ్యాక్సిన్ ఘనత మనదే : లక్ష్మీనారాయణ
ABN, First Publish Date - 2021-01-21T07:13:26+05:30
కరోనాతో కల్లోలంలో ఉన్న ప్రపంచానికి వ్యాక్సిన్ను అందించిన ఘనత మనదేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కరోనాతో కల్లోలంలో ఉన్న ప్రపంచానికి వ్యాక్సిన్ను అందించిన ఘనత మనదేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన కుంభ సందేశ్ రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుంభమేళా గురించి పుస్తకాలు, వీడియోలు రూపొందించి మన ఘన చరిత్ర గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరముందన్నారు. భారతీయం సత్యవాణి మాట్లాడుతూ.. మన ఆహార నియమాలు వైద్యవిధానం కారణంగా మనదేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు.. సమావేశంలో జీశాట్ సభ్యుడు మదన్గుప్తా, జీకాట్ వ్యవస్థాపకుడు ఢిల్లీ వసంత్ మాట్లాడారు. పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రతినిధి గంపా నాగేశ్వరరావు, నారాయణ జిజ్ఞాస, నాగరత్నం నాయుడు, జీకాట్ నిర్వాహకులు రాంరెడ్డి, శ్రవణ్కుమార్, కామేశ్వరరాజు, డా. పాశం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-21T07:13:26+05:30 IST