HYD : ఆ ఇద్దరు విద్యార్థినులు ఏమయ్యారు.. ఇంతకీ ఆ వీడియో సంగతేంటి..!?
ABN, First Publish Date - 2021-11-27T14:53:15+05:30
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు..
హైదరాబాద్ సిటీ/జవహర్నగర్ : బాలాజీనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ కథనం ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు శివనందిని, అక్షయలు శుక్రవారం లెక్చరర్ చెబుతున్న పాఠాన్ని వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసి మొబైల్ను చూస్తున్నారు. ఇది గమనించిన లెక్చరర్ వారిని మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన విద్యార్థినులు కాలేజీ అనంతరం ఇంటికి వెళ్లలేదు. ఎంతకీ విద్యార్థినులు రాకపోవడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు కాలేజీలో ఆరా తీయడంతో విషయం తెలిసింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Updated Date - 2021-11-27T14:53:15+05:30 IST