ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌడీషీటర్‌ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-05-27T13:34:29+05:30

రౌడీషీటర్‌ హత్య కేసులో బహదూర్‌పురా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/మదీన : ఈ నెల 20న రాత్రి బహదూర్‌పురాలో జరిగిన రౌడీషీటర్‌ హత్య కేసులో బహదూర్‌పురా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ డి.దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌ మరాఠీ గల్లీ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ మహ్మద్‌ ఎజాజ్‌ ఈ నెల 20న అర్ధరాత్రి అతడి ఇంటి సమీపంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బహదూర్‌పురా పోలీసులు పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. కిషన్‌బాగ్‌ చిరాగ్‌అలీ నగర్‌ ప్రాంతానికి చెందిన రఫీఖ్‌(65), దావూద్‌(18)లను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించారు. గతంలో వీరికి, హతుడు మహ్మద్‌ ఎజాజ్‌కు పాతకక్షలున్నాయి. పాతకక్షల కారణంగానే హత్య చేశారు. దీంతో నిందితులిద్దరినీ బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-05-27T13:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising