తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం: Revanth
ABN, First Publish Date - 2021-12-14T17:44:13+05:30
తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతోందని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతోందని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ట్వీట్టర్ వేదికగా ఎంపీ స్పందిస్తూ.... ‘‘రుణమాఫీ లేదు, పంటను కొనే నాథుడు లేడు, అమ్మిన పంట సొమ్ముల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తోన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇంటి ముందు అప్పులోడి లొల్లి. సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి తీర్థయాత్రలు, రాజకీయ భేటీలతో బిజీగా ఉన్నాడు’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
Updated Date - 2021-12-14T17:44:13+05:30 IST