తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ABN, First Publish Date - 2021-05-08T17:20:08+05:30
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో....
హైదరాబాద్/బంజారాహిల్స్ : అనారోగ్యంతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య(93) మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుజాతనగర్ నియోజకవర్గం నుంచి 1977-81లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీబీఐ, సీఐడీ కోర్టుల్లో సీనియర్ అడ్వకేట్గా పనిచేశారు. నాలుగు నెలల క్రితం అనారోగ్యం బారిన పడి రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య వరమ్మ ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. సందర్శనార్ధం ఆయన భౌతిక కాయాన్ని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో ఉంచారు. శనివారం మహాప్రస్తానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Updated Date - 2021-05-08T17:20:08+05:30 IST