ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shamshabad: వాటా కోసం అన్న హత్య

ABN, First Publish Date - 2021-11-01T16:09:45+05:30

ఇంట్లో వాటా కావాలని అన్నను తమ్ముడు కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ ప్రకా్‌షరెడ్డి తెలిపిన వివరాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లారీలో వెళ్తుండగానే కత్తితో పొడిచి చంపిన తమ్ముడు

హైదరాబాద్/శంషాబాద్‌: ఇంట్లో వాటా కావాలని అన్నను తమ్ముడు కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ ప్రకా్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల్‌ గ్రామానికి చెందిన యాదగిరి, శ్రీనివాస్‌ అన్నదమ్ములు. ఇద్దరూ లారీ డ్రైవర్లు. వారి తండ్రి ఉన్నపుడే ఆస్తి పంపకాలు చేశాడు. ఇటీవల యాదగిరి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అయితే, కొత్త ఇంట్లో తనకూ వాటా కావాలని శ్రీనివాస్‌ కొన్నాళ్లుగా అన్నతో గొడవపడుతున్నాడు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లి నుంచి అన్నదమ్ములు, మరో ముగ్గురు కలిసి కొరియర్‌ కంటైనర్‌తో మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో గండిగూడ వద్దకు రాగానే లారీలో ఉన్న యాదగిరిని శ్రీనివాస్‌ కత్తితో పొడవగా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యాదగిరికి భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2021-11-01T16:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising