ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కోల్పోతుంది: సంపత్ కుమార్

ABN, First Publish Date - 2021-12-28T20:29:20+05:30

టీఆర్ఎస్ రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కోల్పోతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కోల్పోతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు మతి తప్పి కాంగ్రెస్‌పై మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌పై విమర్శలు మానుకొకపోతే తమ కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వరి వేశారన్న రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. దాన్ని నిరూపించేందుకు తాము సిద్ధమని, టీఆర్ఎస్ నేతలు సిద్దమా? అని సవాల్ చేశారు. వాస్తవాలు బయట పడతాయనే ఎర్రవెల్లి రచ్చబండకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. రెండు రోజుల సమయం ఇస్తున్నామని, వాస్తవాలను చర్చించేందుకు టీఆర్ఎస్ బహిరంగ చర్చకు రావాలన్నారు.

Updated Date - 2021-12-28T20:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising