ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఇంట్లో పెను విషాదం..

ABN, First Publish Date - 2021-04-19T19:33:35+05:30

తెల్లారితే పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఆ ఇంట్లో పెను విషాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/దుండిగల్‌ : తెల్లారితే పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఆ ఇంట్లో పెను విషాదం నెలకొంది. స్నేహితులతో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని వస్తానని ముందు రోజు రాత్రి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌ మితిలీనగర్‌కు చెందిన కరణం శ్రీనివాస్‌ కుమార్‌ కుమారుడు కరణం అభినవ్‌(24) ఆదివారం పుట్టిన రోజు. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో స్నేహితులు, బంధువులతో కలిసి ముందుగా వేడుకలు జరుపుకోవడానికి గండిమైసమ్మ సమీపంలోని శ్రీచైతన్య కాలేజీ సమీపంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగిన తర్వాత రాత్రి 1.20 గంటల సమయంలో స్నేహితుడి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తానని, మరో స్నేహితుడు వంశీతో కలిసి వెళ్లాడు. భౌరంపేట్‌ బంగారుమైసమ్మ ఆలయం వద్దకు రాగానే బైక్‌ అదుపుతప్పి అభినవ్‌, వంశీలు కింద పడ్డారు. వీరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అభినవ్‌ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-19T19:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising