రోశయ్య స్మృతివనం నిర్మిస్తేనే ఆయనకు నిజమైన గౌరవం: రేవంత్ రెడ్డి
ABN, First Publish Date - 2021-12-15T19:26:49+05:30
అందరూ గౌరవించే విధంగా నగరం నడిబొడ్డున రోశయ్య స్మృతివనం నిర్మిస్తేనే ఆయనకు నిజమైన గౌరవమని..
హైదరాబాద్: అందరూ గౌరవించే విధంగా నగరం నడిబొడ్డున రోశయ్య స్మృతివనం నిర్మిస్తేనే ఆయనకు నిజమైన గౌరవమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రోశయ్యకు స్మృతివనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ముఖ్యమంత్రులకు ఏమాత్రం తీసిపోని నాయకుడు రోశయ్యని కొనియాడారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నేత... గాంధీ కుటుంబానికి పీతిపాత్రుడైన రోశయ్య మరణం గురించి సోనియా గాంధీ తన నుంచి వివరాలు అడిగి తీసుకున్నారన్నారు. రోశయ్య సూచనతోనే సమస్యలపై మాట్లాడే ముందు అవగాహన చేసుకుని మాట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-12-15T19:26:49+05:30 IST