ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేప్‌ చేశాడు.. విషమిచ్చాడు

ABN, First Publish Date - 2021-04-14T06:33:54+05:30

ఇంట్లో కిరాయికి ఉండే కుటుంబంలోని బాలికపై కన్నేసి, ప్రేమిస్తున్నాని వేధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చావు బతుకుల మధ్య ఓ బాలిక
  • వీడియో తీసి బెదిరింపులు
  • పలుమార్లు అత్యాచారం
  • ఆత్మహత్య చేసుకుంటానన్న బాలిక
  • ఆస్పత్రిలో చేరిన బాధితురాలు
  • పోలీసులకు వాగ్మూలం

జీడిమెట్ల, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో కిరాయికి ఉండే కుటుంబంలోని బాలికపై కన్నేసి, ప్రేమిస్తున్నాని వేధించాడు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. వీడియో తీసి బెదిరించి, పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె ఎదురుతిరిగింది. విషం తాగి చస్తా కానీ, లొంగనంటూ ప్రతిఘటించింది. అయినా, నిన్ను వదిలేది లేదంటూ.. కావాలంటే చచ్చిపో అంటూ విషం తెచ్చి ఇచ్చాడు. రోజూ అతడి చేతిలో చావటం కంటే, ఒకేసారి చనిపోదామని ఆ బాలిక విషం తాగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తనపై జరిగిన దారుణాలను పోలీసులకు వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. 


కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంటి వద్దే ఉంటోంది. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. వారు అద్దెకు ఉండే ఇంటి యజమాని కుమారుడు వై. మధుసూదన్‌రెడ్డి ఆమెను ప్రేమిస్తున్నాని వెంటపడేవాడు. ఆమె తండ్రి ఫోన్‌కు కాల్‌ చేసి, బాలికను మాట్లాడమని వేధించేవాడు. ఆమె తండ్రి డ్యూటీ నుంచి వచ్చే భార్యను తీసుకురావడానికి రోజూ వెళ్తాడు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. విషయం తెలిసిన మధుసూదన్‌ ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి, తలుపులు మూసి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్ని వీడియో కూడా తీశాడు. ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తానని, వీడియోలు, ఫొటోలు బయటపెడతానని తరచూ లైంగికదాడికి పాల్పడేవాడు.


ఈ నెల 10న బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మరోసారి లైంగికదాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించింది. బలవంతం చేస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరించింది. అయితే, మధుసూదన్‌ సోమవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ‘నాకు లొంగితే సరే.. లేదంటే చచ్చిపో’ అంటూ విషం బాటిల్‌ ముందు పెట్టాడు. దీంతో ఆమె విషం తాగింది. ఆమె పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. బాలిక స్ప్రహలోకి రావడంతో పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఆమె జరిగిన విషయం చెప్పడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-04-14T06:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising