ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసభ్య పదజాలంతో దూషించారని TPCC Revanth పై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-08-28T16:38:31+05:30

మూడుచింతలపల్లిలో దీక్ష చేపట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : మూడుచింతలపల్లిలో దీక్ష చేపట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంత్రి మల్లారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించారని మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు కొండల్‌ ముదిరాజ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో భిక్షపతిరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.


మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాప్రాలో కాంగ్రెస్‌ నాయకులు మంత్రి దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. మంత్రి మల్లారెడ్డి రేవంత్‌రెడ్డికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ పత్తికుమార్‌, నాయకులు టిల్లు యాదవ్‌, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివాసులు, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T16:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising