ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాయమైన ‘భౌతికదూరం’

ABN, First Publish Date - 2021-05-12T15:55:08+05:30

పదిరోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటన రావడంతో ఒక్కసారి ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ ప్రకటనతో కొనుగోళ్లకు ఎగబడ్డ జనం

హైదరాబాద్/సైదాబాద్‌: పదిరోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటన రావడంతో  ఒక్కసారి ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చారు. సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా కిరాణ దుకాణాలు, కూరగాయలను కోనుగోలు చేయడానికి ఎగబడ్డారు. ముఖ్యంగా మాదన్నపేట కూరగాయల మార్కెట్‌కు పెద్దసంఖ్యలో జనాలు రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మార్కెటంతా రద్దీ ఏర్పడింది.


వైన్స్‌ దుకాణాల ముందు బారులు

బుధవారం నుంచి లాక్‌డౌన్‌ ఉంటుందని తెలియగానే  వైన్స్‌ దుకాణాలకు  మందుబాబులు పోటెత్తారు. సైదాబాద్‌, చంపాపేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, మీర్‌పేట, హయత్‌నగర్‌, నాగోల్‌, కర్మన్‌ఘాట్‌ ప్రాంతాలలో వైన్స్‌ దుకాణాల ఎదుట మద్యం కోసం బారులు తీరారు. దీంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగాయి. పలు దుకాణాలలో మద్యం నిల్వలు ఖాళీ అయ్యాయి. కొందరు వైన్స్‌ యాజమానులు ఇదే అదనుగా భారీ స్థాయిలో బెల్ట్‌ షాపులకు మద్యం తరలించారు. 

Updated Date - 2021-05-12T15:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising