HYD : పెళ్లి బరాత్లో మద్యం తాగి హంగామా.. పోలీసులపై దుర్భాషలు..
ABN, First Publish Date - 2021-08-28T14:50:38+05:30
అర్ధరాత్రి వరకు పెళ్లి బృందం బరాత్ నిర్వహించింది. స్థానిక ప్రజలు 100కు డయల్ చేయడంతో...
హైదరాబాద్ సిటీ/సనత్నగర్ : మోతీనగర్లోని స్నేహపురికాలనీలో జరిగిన పెళ్లి బరాత్లో మద్యం తాగి హంగామా సృష్టించిన కొందరిపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహపురికాలనీలో గురువారం అర్ధరాత్రి వరకు పెళ్లి బృందం బరాత్ నిర్వహించింది. స్థానిక ప్రజలు 100కు డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని డీజేను ఆపాలని కోరారు. దీంతో బృందం సభ్యులు పోలీసులను దుర్బాషలాడుతూ దాడికి దిగారు. అంతటితో ఆగకుండా బెదిరించేలా వ్యవహరిస్తూ పెళ్లి బృందం వారిపై తిరగబడింది. దీంతో అనుమతి లేకుండా బరాత్ నిర్వహిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు జానకిరామ్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సనత్నగర్ పోలీసులు తెలిపారు.
Updated Date - 2021-08-28T14:50:38+05:30 IST