ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్లు తప్పు చేస్తూ.. నాపై ఆరోపణలు: అజారుద్దీన్

ABN, First Publish Date - 2021-06-17T18:24:02+05:30

హెచ్‌సీఏ నోటీసులపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హెచ్‌సీఏ నోటీసులపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో 9 మంది ఉంటే.. ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడి.. తాము చెప్పిందే వేదంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో జరుగుతున్న... జరిగిన అవినీతిని అరికట్టడానికి సమర్థవంతమైన వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే.... ఆ ఐదుగురే తప్పు పట్టారన్నారు. కారణం... వాళ్ళ తప్పుడు పనులు, వాళ్ళ అవినీతి బయట పడుతుందనే అలా చేశారన్నారు. హెచ్‌సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 


అడ్డుకోవాలని చూస్తున్న తనపై బురద చల్లుతున్నారన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కి కూడా ఆ అయిదుగురు హాజరవ్వడం లేదన్నారు. జాన్ మనోజ్, విజయానంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ.... ఈ ఐదుగురి పై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. వీళ్ళ అవినీతికి తాను అడ్డుపడుతున్నాననే... వీళ్లకు వీళ్ళు మీటింగ్ పెట్టుకుని నాకు నోటీసులు ఇచ్చారన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారని అజహర్ అన్నారు.


Updated Date - 2021-06-17T18:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising