రైతుల జీవితం కల్లాల్లో తెల్లారుతోంది: Seethakka
ABN, First Publish Date - 2021-11-27T17:52:58+05:30
రైతుల జీవితం కల్లాల్లో తెల్లారుతోందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
హైదరాబాద్: రైతుల జీవితం కల్లాల్లో తెల్లారుతోందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 10 వేల కోట్లు పెట్టి వరి ధాన్యం కొనుగోలు చేయలేరా అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ డ్రామాలు ఆపేయాలని హితవుపలికారు. కేసీఆర్ జంతర్మంతర్ దగ్గర ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ముందు వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.
Updated Date - 2021-11-27T17:52:58+05:30 IST