కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు: Danam
ABN, First Publish Date - 2021-12-14T17:29:18+05:30
సంఖ్యాబలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది పోటీ చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
హైదరాబాద్: సంఖ్యాబలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది పోటీ చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎన్నో కుట్రలు చేసి ఏదో ఒకటి గెలవాలని ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే కేసీఆరే తమ నాయకుడని అందరూ ఓటు వేశారన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు తమకు కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవుపలికారు. డబ్బుల ద్వారా కొనాలని చూశారని... కానీ వారి ఆటలు సాగలేదని దానం నాగేందర్ అన్నారు.
Updated Date - 2021-12-14T17:29:18+05:30 IST