మానవత్వం చాటిన Minister KTR..
ABN, First Publish Date - 2021-11-18T12:18:39+05:30
మానవత్వం చాటిన Minister KTR..
- రోడ్డు ప్రమాద బాధితులను..
- ఇద్దరిని ఎస్కార్ట్లో ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్ సిటీ/అల్వాల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఎస్కార్ట్లో ఆస్పత్రికి తరలించి మంత్రి కేటీఆర్ మానవ త్వం చాటుకున్నారు. బుధవారం రాత్రి మియాపూర్కు చెందిన పవన్, నగేష్ శామీర్పేట నుంచి మియాపూర్ వైపునకు వెళ్తుండగా, హకీంపేట నిషా వద్ద బైక్ జారి కిందపడ్డారు. అదే మార్గం గుండా వెళ్తున్న మంత్రి కేటీఆర్ గమనించి కాన్వాయి పక్కకు నిలిపారు. వారిని తన ఎస్కార్ట్లో సమీప ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2021-11-18T12:18:39+05:30 IST