ప్రతీ ఆదివారం ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు...KTR ఆదేశం
ABN, First Publish Date - 2021-08-24T15:33:11+05:30
నగరవాసుల సందర్శనార్ధం ప్రతీ ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్: నగరవాసుల సందర్శనార్ధం ప్రతీ ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని నగర సీపీకి కేటీఆర్ సూచనలు చేశారు. హైదరాబాద్ వాసుల ట్విట్టర్ విజ్ఞప్తి మేరకు మంత్రి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ జరుగనుంది. ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
Updated Date - 2021-08-24T15:33:11+05:30 IST