ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి KTR పర్యటన

ABN, First Publish Date - 2021-08-28T15:29:34+05:30

మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటీఆర్ ప్రాంభించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను  కేటీఆర్ ప్రాంభించనున్నారు. హైదరాబాద‌ను స్లమ్ ఫ్రీ  సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెలు బస్తీలో రూ.24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్‌ఎంసీ నిర్మించింది. ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించింది. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ 560 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. మౌలిక సదుపాయాల కల్పనతో కలిపి ఒక్కొక్క  డబుల్ బెడ్ రూమ్ ఇంటిని రూ. 8.65 లక్షల వ్యయంతో నిర్మాణం జరిగింది. సిసి రోడ్లు, సీవరేజ్ లైన్లు, త్రాగునీటికై సంపు నిర్మాణం, ఐదు లిఫ్ట్‌ల ఏర్పాటు, విద్యుదీకరణలను చేపట్టింది. ఈ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ల నిర్వహణకు గాను 19 దుకాణాలను జీహెచ్ఎంసీ నిర్మించింది. చంచల్ గూడ ప్రధాన జంక్షన్‌లో నిర్మించిన ఈ డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లు మార్కెట్‌లో ఒక్కొక్కటి కనీసం రూ.40 లక్షలకు పైగానే ఉంటుంది.

Updated Date - 2021-08-28T15:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising