రోశయ్య మృతి బాధాకరం: మంత్రి KTR
ABN, First Publish Date - 2021-12-04T16:30:47+05:30
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. రోశయ్య కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మాజీ సీఎం రోశయ్య ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. లో-బీపీతో అకస్మాత్తుగా పడిపోయిన రోశయ్యను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రోశయ్య తుదిశ్వాస విడిచారు.
Updated Date - 2021-12-04T16:30:47+05:30 IST