ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపేశారు.. లొంగిపోయారు

ABN, First Publish Date - 2021-04-14T06:32:54+05:30

సైదాబాద్‌ ఠాణా పరిధిలో జరిగిన మహిళ హత్య మిస్టరీ దాదా పు వీడింది.

మంజుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైదాబాద్‌ మహిళ హత్య కేసు

సైదాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): సైదాబాద్‌ ఠాణా పరిధిలో జరిగిన మహిళ హత్య మిస్టరీ దాదా పు వీడింది. ఏడాదిగా కనిపించకుండా పోయిన భర్త చేసిన అప్పు నేపథ్యంలో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. సైదాబాద్‌ లోకాయుక్తాకాలనీలోని నయాగ్రా అపార్ట్‌మెంట్‌లో మూడో ప్లోర్‌లో నివాసముండే మంజుల, పరిమల్‌ ఆగర్వాల్‌  ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి  కూతు రు, కుమారుడు. పరిమల్‌ మెడికల్‌ ఏజెన్సీ వ్యాపా రం చేస్తుండగా,  పాతబస్తీకి చెందిన ఒకరి నుంచి రూ. 30 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఏడాదిగా కనిపించకుండా పోయాడు. అప్పు ఇచ్చిన వారు అప్పటి నుంచి పలుమార్లు మంజుల వద్దకు వచ్చి పరిమల్‌ ఆచూకీ చెప్పాలని వేధించారు. తనకు అతడితో సంబంధాలు లేవని ఆమె చెప్పింది.  సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ మహి ళ, నలుగు రు  మంజుల ఇంటికి వచ్చి, అప్పు చెల్లించాలని గొడవకు దిగారు. వీరి అరుపులు విన్న వాచ్‌మన్‌ అపార్ట్‌మెంట్‌లో గొడవ చేయవద్దని చెప్పాడు. దీంతో వారం తా బయటకు వచ్చారు. ఆమె తనకు సంబంధం లేదని చెప్పడంతో ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచి, పారిపోయాడు. ఆమె అరుపులకు అపార్ట్‌మెంట్‌వాసులు చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సైదాబాద్‌  పోలీసులు కేసు  దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. నిందితుల్లో అప్పు ఇచ్చిన వ్యక్తితో పాటు అతని తల్లి, మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది.  

Updated Date - 2021-04-14T06:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising