ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతుల పాదయాత్రకు హైదరాబాద్‌లో మద్దతు..

ABN, First Publish Date - 2021-12-15T16:01:58+05:30

అమరావతి రైతులకు హైదరాబాద్‌లో ప్రవాసాంధ్రులు మద్దతు తెలుపుతూ ఇవాళ ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: న్యాయస్థానం టూ దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బుధవారం రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 45 రోజులపాటు నిర్విరామంగా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అమరావతి మద్ధతుదారులు ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. కేపీహెచ్‌బీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు దీక్షలు చేస్తున్నారన్నారు. అలాగే తాము కూడా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

Updated Date - 2021-12-15T16:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising