కల్పతరు డే సందర్భంగా ఆర్కే మఠ్ పుస్తకాలపై 40% డిస్కౌంట్
ABN, First Publish Date - 2022-01-01T01:28:02+05:30
హైదరాబాద్: కొత్త సంవత్సరం 2022 తొలి రోజు జనవరి ఒకటిన రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది.
హైదరాబాద్: కొత్త సంవత్సరం 2022 తొలి రోజు జనవరి ఒకటిన రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది. వివేకానంద సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.
ప్రతియేటా జనవరి ఒకటిన రామకృష్ణ మఠంలో కల్పతరు పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం ఏడున్నరకు విశేష పూజ, భజనలుంటాయి. పదింబావుకు హోమం నిర్వహిస్తారు. 11 గంటలకు ప్రసంగం ఉంటుంది. 11:50కి విశేష హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోజన ప్రసాదం ఉంటుంది. సాయంత్రం 6:45కు ఆరాత్రికం, 7:15కు ప్రత్యేక భజనలుంటాయి.
Updated Date - 2022-01-01T01:28:02+05:30 IST