కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది ఘాతుకం
ABN, First Publish Date - 2021-06-19T02:03:46+05:30
కడప : జిల్లాలోని బద్వేలు మండలం చింతలచెరువులో దారుణం చోటుచేసుకుంది.
కడప : జిల్లాలోని బద్వేలు మండలం చింతలచెరువులో దారుణం చోటుచేసుకుంది. తనను శిరీష(19) అనే అమ్మాయి ప్రేమించట్లేదని.. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లిన కిరణ్.. అతి కిరాతకంగా యువతి గొంతు కోసేశాడు. విషయం గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత కిరణ్ కూడా పురుగుల మందు తాగినట్లు సమాచారం. చరణ్ను పట్టుకుని గ్రామస్తులు, యువతి బంధువులు చితకబాది.. పోలీసులకు అప్పగించారు. గాయాలతో ఉన్న ఆ ప్రేమోన్మాదిని ఆస్పత్రికి తరలించి పోలీసులు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే చరణ్ ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2021-06-19T02:03:46+05:30 IST