ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల నడక మార్గంలో హైదరాబాద్ యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-02-28T15:08:41+05:30

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్‌ యువకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్‌ యువకుడు అలిపిరి నడక మార్గంలో హఠాన్మరణం పాలయ్యాడు. విజిలెన్స్‌ అధికారుల కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి రాహుల్‌(23) శ్రీవారి దర్శనం కోసం శనివారం ఉదయం తిరుపతికి చేరుకున్నాడు. మొక్కు తీర్చుకునే క్రమంలో స్నేహితులతో కలిసి అలిపిరి నుంచి తిరుమల కొండకు నడక ప్రారంభించాడు. గాలిగోపురం వద్ద గుండెనొప్పితో రాహుల్‌ కుప్పకూలిపోయాడు. గుర్తించిన స్నేహితులు వెంటనే అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రాహుల్‌ను పరిశీలించిన వైద్య సిబ్బంది అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

Updated Date - 2021-02-28T15:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising